సత్యసాయి: బుక్కపట్నం మండలం యాదలంకిపల్లి రైతులు పొలాలకు వెళ్లేందుకు రామ్ సాగరం వంక అడ్డంకిగా మారింది. ఆర్డీటీ చెక్ డ్యాం కింద ఉన్న 150 ఎకరాల సాగు భూమికి వెళ్లాలంటే నిత్యం మూడు అడుగుల నీటిలో ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోంది. పాములు, వన్యప్రాణుల భయంతో కూలీలు పనులకు రావడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.