AKP: రంజాన్ సందర్భంగా ఎలమంచి పట్టణం జామియా మసీదులో బుధవారం 175 ముస్లిం కుటుంబాలకు జామియా మసీదు మత పెద్దలు రంజాన్ తోఫా అందజేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు కఠిన ఉపవాసంతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిందని తెలిపారు. అల్లాహ్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.