MBNR: పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ప్రో జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పరాభవ నామ కొత్త సంవత్సరంలో విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రో. పీ. రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.