MHBD: కొత్తగూడెం మండలం బూరుగు గుంపు గ్రామానికి చెందిన మల్లెల అశ్విని- మహేష్ దంపతుల మూడు నెలల కూతురు ఊపిరితిత్తుల వ్యాధితో ప్రాణాలతో పోరాడుతుంది. ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ తన వంతు సహాయంగా రూ. 4,000 నగదును ఆ కుటుంబానికి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.