WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో డాక్టర్ ఆకారపు రాజగోపాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో 156 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిబిరంలో రక్తపోటు, షుగర్, సాధారణ జ్వరాలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.