NTR: పవిత్ర సంగమం వెళ్లే రహదారిలోని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో మంచినీటి పైప్ లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మున్సిపల్ అధికారులు ఈ పనులను వేగవంతం చేశారు. భూగర్భ పైపుల ఏర్పాటు పనులను అధికారులు నిశితంగా పర్య వేక్షిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే మంచినీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి.