ASR: నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ప్రతినిధులు ఎస్.వరలక్ష్మి, అంజలి తెలిపారు. మంగళవారం కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం, పనసలపాడు గ్రామాల్లో ‘రైతన్న మీకోసం’ నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని రైతులతో సమావేశమయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు.