కృష్ణా: బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామ ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం కేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి సరఫరా గురించి అధికారులతో చర్చించారు. రైతులకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలువల శుభ్రత, మరమ్మతులను వేగవంతంగా చేయాలని సూచించారు.