MDK: అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుందని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల శిక్షణా తరగతుల ముగింపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదని, 2021లో జరగాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ వల్ల ఆలస్యమైందన్నారు. ప్రతి ఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన పూచించారు.