NLG: చండూరు మండలం కొండాపురం గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు గట్టుప్పల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.