NRML: అసైన్డ్ భూముల్లో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే పట్టాలను రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. తానూర్ మండలంలో కొందరు లబ్ధిదారులు తమకు కేటాయించిన భూములను సాగు చేయకుండా మొరం వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్టాలను ఇప్పటికే రద్దు చేసినట్లు మంగళవారం పేర్కొన్నారు.