SRPT: మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. హాస్టల్ గదులు, వంటశాలను పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ అమలుపై ఆరా తీశారు. పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.