KMM: వెలుగుమట్ల పరిధిలో భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. OPDR సభ్యులమని నమ్మించి బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుల మూడు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశామని మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.