HNK: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. దామెర MROకు బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.