ATP: పామిడిలో మంగళవారం వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ప్రతి ముస్లిం కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు ఆమె రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.