NLG: చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలోని వార్డుల్లో మంగళవారం సీసీ రోడ్ల పనులను సర్పంచ్ కట్ట ఆశయ్య, ఉప సర్పంచ్ సామిడి సాయి కృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా మార్చడమే కాకుండా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.