KRNL: ఆలూరు హెబ్బటం నుంచి కురుకుంద గ్రామాల వరకు త్రాగునీటి పైపు లైన్ కోసం రూ.59 లక్షల గ్రాంట్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరికి వినతిపత్రం సమర్పించారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి, రైతులు, స్థానికులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను వివరించి, వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.