ADB: తలమడుగు మండల కేంద్రంలో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, తదితరులున్నారు.