NDL: జిల్లాకు చెందిన నరేంద్ర (35) అనే రాడ్ బెండింగ్ కార్మికుడు గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుడి భార్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.