తమిళ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ టీజర్ ఇన్స్టాగ్రామ్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. దాదాపు 1.3 మిలియన్ అకౌంట్లు దీన్ని షేర్ చేశాయి. ఇటీవల కాలంలో తమిళ చిత్ర టీజర్కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి.