NRML: నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన మంగళవారం మరింత ఉదృతమైంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.