PLD: మాచవరం మండలం సింగరాయపాలెం తండా సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కొండ దిగువన గల కళ్యాణ మండపంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు పిల్లుట్ల సర్పంచ్ శివపార్వతి సాంబశివరావు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.