KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నియోజకవర్గ కేంద్రంలోని సాగు భూములను సందర్శించి, నేరుగా రైతులను వారి పొలాల వద్దే కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, పంటల పరిస్థితి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై వారితో చర్చించారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.