SDPT: బెజ్జంకి మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, నెలకు రూ.26,000 కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.