SRD: సిర్గాపూర్ మండలంలోని రైతులకు రైతు భరోసా పథకంలో బ్యాంకు అకౌంట్ మార్చుకునే అవకాశం ఉందని ఎంఏవో హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఈ పథకంలో అకౌంట్ మార్పు చేయాలనుకునే రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. నేడు, రేపు ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు రైతు భరోసా ఫారం, పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని పేర్కొన్నారు.