TPT: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చనలు జరుగుతాయి. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.