MHBD: కారులో వచ్చి గొర్రెపోతును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడ మండల మోకాళ్లపల్లిలో నిన్న అర్ధరాత్రి పశువుల కాపరి కొమ్మయ్య దొడ్డిలో కట్టిన గొర్రెల మందలో ఒక ఖరీదైన గొర్రెపోతును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన గొర్రెపోతు విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఇవాళ బాధితుడు స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశాడు.