NTR: విజయవాడ ఏ కన్వెన్షన్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇమామ్, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ. 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని అన్నారు. అమరావతిలో త్వరలో హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు