PDPL: రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నగర మేయర్ మహంకాళి స్వామి సోమవారం భూమి పూజ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి పాల్గొన్నారు.