KRNL: ఎమ్మిగనూరు MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గం విజన్ – స్వర్ణాంధ్ర 2027 కేంద్రాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించారు. విజన్ – స్వర్ణాంధ్ర 2027 యంగ్ ప్రొఫెషనల్ బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించి, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధన, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్రంగా చర్చించారు.