నంద్యాల: పాములపాడు మండలం బనకచర్లలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను కొనియాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.