ADB: నేరడిగొండ మండలంలోని కుంటాల(కే) గ్రామానికి చెందిన సత్నాల తహసీల్దార్ రామరావు తండ్రి నెమ్య నాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.