SKLM: జిల్లా కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు డీఆర్ఓ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు.