MNCL: కూలి పనులకు వెళ్లిన ఓ మహిళ విద్యుత్ షాక్కి గురై మరణించినట్లు SI రాజశేఖర్ తెలిపారు. జైపూర్ మండలం పౌనూరు గ్రామానికి చెందిన అఖిల(27) పొలంలో కలుపు తీస్తుండగా, విద్యుత్ మోటార్ ఇనుప పైపును తాకింది. దీంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోగా, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.