GNTR: కొల్లిపర మండలంలోని కొల్లిపర, అత్తోట, వల్లభాపురం పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని SI ఎన్.సి. ప్రసాద్ వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల దృష్ట్యా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.