KDP: వేములలో సోమవారం రైతన్న మీ కోసం నిర్వహిస్తున్నట్లు ఏfy ఓబులేసు ఆదివారం తెలపారు. మండలంలో 6,224 మంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు, 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.