KDP: బద్వేల్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పట్టణంలో శ్రీనివాసులు వ్యాపారి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. పర్యావరణానికి హాని కలిగించని బయో డిగ్రేడబుల్ వస్తువులను మాత్రమే విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు ఆ వ్యాపారిని కమిషనర్ సత్కరించారు.