NDL: రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాల నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాన్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్లో భాగంగా నంద్యాలలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మల సత్రం ఆర్టీసీ బస్టాండ్ బైర్మల్ విధి శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.