NZB: పోతంగల్ మండలం హంగర్గా ఫారానికి చెందిన కుంటను రమ(30) అనే మహిళ శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త మద్యానికి బానిసై పనికి వెళ్లకపోవడంతో కుటుంబ పోషణ భారమై, మనస్తాపంతో ఈనెల 12న ఆమె పురుగు మందు తాగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.