AP: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఉద్యోగుల నుంచి PRCపై ఆందోళన వ్యక్తమవుతోందని, రెండేళ్లైనా IR ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. బకాయిల ఊసేలేదని, సరెండర్ లీవ్స్, DAలు పెండింగ్లో ఉన్నాయని.. ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.