VZM: జిల్లా పంచాయతీ అధికారి డీవీ మల్లికార్జున రావు శనివారం డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి పన్ను వసూళ్లును పరిశీలించి, ఆ గ్రామంలోని ఒక ఇంటికి వెళ్లి ఇంటిపన్ను కట్టించి రసీదును ఇంటి యజమానికి అందజేశారు. అలాగే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.