ADB: కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్లోని ఖిజార మస్జిద్లో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ దావత్లో ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఖర్జూర పండు తినిపించి ఉపవాస దీక్ష విరమించారు.