ADB: తలమడుగు, బరంపూర్ పదో తరగతి పరీక్ష కేంద్రాలను తహశీల్దార్ రాజ్ మోహన్ శనివారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావుండకూడదని అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు సహా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆయనతో పాటు ఎస్సై రాధిక, తదితరులు ఉన్నారు.