ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల పేపర్ మూల్యాంకన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు DIEO గణేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం తొలిరోజు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సివిక్స్ పేపర్లకు మూల్యాంకనం జరుగుతుందన్నారు.