NGKL: పదర మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తక్కువ వోల్టేజ్ సమస్యలు తగ్గి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.