MDK: కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సందర్శించారు. ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.