MNCL: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు.