KMM: ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్-స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా ఎంపీని లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్సభ కాలానికి సంబంధించి భారత్-స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు.