AP: గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కేంద్రం పరిస్థితిని పర్యవేక్షిస్తోందన్నారు. కుటుంబ అవసరాలకు ఏ మాత్రం లోటురాకుండా చేయడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. గ్యాస్పై ప్రజల ఆందోళనను ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్కి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.