WGL: ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. CP మాట్లాడుతూ.. వేసవి తాపం పెరుగుతున్నందున పిల్లలు ఈత కోసం చెరువులు, కుంటలకు వెళ్లే అవకాశం ఉందని, అటువంటి సందర్భాల్లో వారి పై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.